ఇది శ్రీ మంజునాధ చిత్రం కోసం భారవి గారు రాసిన పాట. ఈ పాట అంతా శివ స్తోత్రాలతో ఉంటుంది. ఇవన్ని మనకి తెలిసిన స్తోత్రాలే అయినా ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాట లోని స్తోత్రాలన్నీ వర్ణమాలా క్రమంలో ఉంటాయి. అంటే ఓం అక్షరాయ నమః, ఆద్యంతరహితాయనమః, ఇందీవరదళశ్యామాయనమః, ఈశ్వరాయనమః ... ఇలా అ, ఆ, ఇ, ఈ, ... వర్ణమాల లోని అక్షరాలతో సాగిపోతుంది ఈ పాట. ఇలా స్తోత్రాలన్నిటిని కష్టపడి వర్ణమాలా క్రమం లో అమర్చిన భారవి గారిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.
ఇక విషయానికొస్తే ఈ పాట ఓం అక్షరాయ నమః అని మొదలవుతుంది. ఈ స్తోత్రం లోని అంతరార్ధం మొదట నాకు పూర్తిగా అర్ధం కాలేదు. మనకి తెలిసినంతవరకు అక్షరం అనేది విద్యకి సంబంధించిన పదం. సాధారణంగా మనం విద్య కి అధిదేవతలుగా సరస్వతీ దేవిని కాని, గణపతి ని కానీ పూజిస్తాం. మరి అక్షరాయ నమః అనే స్తోత్రం శివుడికి ఎలా వర్తిస్తుంది? మన దేవతా స్తోత్రాలలో కొన్ని అందరు దేవుళ్ళకీ వర్తించేలా ఉంటాయి. అంటే లోకరక్షక, భక్తజనపాలక లాగ. ఇది కూడ అలాగే ఆపాదించిన ఎదో ఒక స్తోత్రం అని సరిపెట్టుకున్నాను.
కానీ కొన్ని రోజుల తర్వాత దాని అంతరార్ధం తెలుసుకున్నాను. నిజానికి అక్షరం ఒక సంస్కృత పదం. న క్షరం అని దానికి విగ్రహం. వ్యతిరేకార్ధాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది నఞ్ తత్పురుష సమాసం. క్షరం అంటే నాశనం. అక్షరం అంటే నాశనం లేనిది. అంటే ఓం అక్షరాయ నమః అనే స్తోత్రం తో శివుణ్ణి నాశనము లేని వాడా అని కీర్తించినట్టు. అది కూడ పాట ప్రారంభం లో ఇలా స్తుతించటం ఎంతైనా సమంజసం.
Showing posts with label నాకు తెలిసిన సంగతులు కొన్ని. Show all posts
Showing posts with label నాకు తెలిసిన సంగతులు కొన్ని. Show all posts
Wednesday, March 21, 2007
Monday, April 24, 2006
మన మహాభారతం తెలుసుకుందాం
మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.చిన్నతనం నుంచీ మనకు పరిచయమున్న మహాభారతం లో మనకెంత తెలుసో ఒకసారి పరీక్షించుకుందాం.
౧.కౌరవులు పాండవులను లక్క ఇంటిలో దహనం చెయ్యటానికి కుట్ర పన్నారని మనందరికీ తెలుసు.అయితే ఆ లక్క ఇంటిని ఏ ఊరిలో నిర్మించారు?దాన్ని నిర్మించిన వాస్తు పండితుడు ఎవరు?
జ) లక్క ఇంటిని కౌరవులు వారణావతం అనే ఊరిలో నిర్మిస్తారు. ఆ ఇంటిని నిర్మించిన వాస్తు పండితుడు పురోచనుడు. పాండవులకు ఆ ఊరిపై ఆసక్తి కలగటానికి ఎల్లప్పుడూ ఆ ఊరి గురించి వర్ణించేందుకు కౌరవులు కొందరు జీతగాళ్ళను నియమిస్తారు.వారి మాటల వల్ల ఆ ఊరిపై ఆసక్తి కలిగి పాండవులు ఆ ఊరికి బయలుదేరేటపుడు భీష్ముడు వారిని హెచ్చరిస్తాడు.అంతే కాక వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి(సొరంగం తవ్వేందుకు) ఒక సహాయకుడిని వారి కన్నా ముందే అక్కడికి పంపిస్తాడు.
౨.పాండవుల పురోహితుడు ఎవరు? అతడిని పురోహితుని గా వారికి సూచించినదెవరు?
జ)పాండవుల పురోహితుడు ధౌమ్యుడు. అతణ్ణి వారికి పురోహితునిగా సూచించేది కుంభీనసి అనే ఒక గంధర్వ కాంత. అర్జునుడు ఈమెకు పాశుపతాస్త్రాన్ని భోధించి తాను ఆమె వద్ద చాక్షుషీ విద్య నేర్చుకుంటాడు.
౩.మహాభారతం చదివిన వారికి గుర్తుండిపోయే పాత్రల్లో మొట్తమొదటిది భీష్ముడి పాత్ర.ఆయనకి ఆ పేరు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ వలన వచ్చినదే.అయితే భీష్ముడి అసలు పేరు ఏమిటి?
జ) భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు.(నిజానికి భీష్ముడు శాపగ్రస్తుడైన ధ్యో అనే వసువు అంశలో జన్మిస్తాడు.)
౪.అర్జునుడికి గాండీవి అనే పేరు ఆయన ధరించే ధనస్సు వల్ల వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ విల్లును అర్జునునికి బహుకరించేదెవరు? ఏ సమయంలో?
జ)గాండీవం అనే విల్లు నిజానికి వరుణుడిది.(అందుకే మహాప్రస్థాన సమయంలో అర్జునుడు ఆ విల్లును గంగా నదిలో వదిలేస్తాడు.)అయితే ఈ విల్లుని అగ్ని దేవుడు ఖాండవ దహన సమయంలో బహుకరిస్తాడు(కారణం ఖాండవ వనాన్ని ఇంద్రుడు రక్షిస్తూండటం.)
౫.జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆపేదెవరు?యాగం ఆగే సమయానికి ఋత్విక్కులు ఎవరిని యజ్ఞ గుండం లోకి ఆవాహన చేస్తారు?
జ)సర్పయాగాన్ని ఆపేది అస్తీకుడు.(ఇతను ఆదిశేషుడికి మేనల్లుడు అవుతాడు.అస్తీకుడు సర్పయాగాన్ని ఆపటానికై జన్మించిన కారణ జన్ముడు. ఇతను యజ్ఞ వాటికకి వచ్చి వేద మంత్రాలతో ఆ యజ్ఞం చేస్తున్న రాజుకు ఆశీర్వచనాలు చదువుతూ ఉంటాడు. రాజు అతన్ని చూసి ముచ్చట పడి ఏం కావాలో కోరుకోమనగా ఈ యజ్ఞాన్ని ఆపేయమని కోరతాడు.)యజ్ఞం ఆపే సమయం లో ఋత్విక్కులు తక్షకుడిని ఆవాహన చేస్తారు.అయితే తక్షకుడు భయంతో ఇంద్రుడి అభయం పొందగా మంత్ర ప్రభావం వల్ల ఇంద్రుడు కూడా యజ్ఞ గుండంలో పడబోతాడు. ఐతే యజ్ఞం ఆగిపోయిన కారణంగా రక్షింపబడతాడు.(తక్షకుడిని ఆవాహన చెయ్యటానికి ఋత్విక్కులు చదివే మంత్రం "సహేంద్రే తక్షకాయ స్వాహా!")
౬.అజ్ఞాతవాస సమయం లో పాండవుల మారు పేర్లేమిటి?
జ)ధర్మ రాజు: కంకభట్టు.
భీముడు:వలలుడు.
అర్జునుడు: బృహన్నల.
నకులుడు:థామగ్రంధి.
సహదేవుడు:తంత్రీపాలుడు.
౭.రణరంగం లో వీరవిహారం చేస్తున్న ద్రోణుడిని అస్త్ర సన్యాసం చేయించటానికి శ్రీకృష్ణుడు 'అశ్వత్థామ' అనే ఏనుగును చంపించి ధర్మరాజు చేత 'అశ్వత్థామ హతః' అని గట్టిగా 'కుంజరః' అని చిన్నగా అనిపిస్తాడు.ఇంతకీ ఆ 'అశ్వత్థామ' ఏనుగును చంపేదెవరు?
జ)'అశ్వత్థామ' ఏనుగును చంపేది భీముడు.(తన కుమారుడైన అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు.)
౮.యుద్ధ ప్రారంభ సమయంలో ధర్మరాజు ఇరుపక్షాల లో ఎవరైనా పక్షం మారాలనుకుంటే మారవచ్చని ప్రకటిస్తాడు.ఆ సమయం లో ఎవరెవరు తమ పక్షాలు మారతారు?
జ)ధర్మరాజు చేసిన ప్రకటనతో పక్షం మారేది యుయుత్సుడు.(ఇతను ధ్రుతరాష్త్రుడికి ఒక దాసి వల్ల జన్మిస్తాడు.పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళే సమయం లో బాలుడైన పరీక్షిత్తు ను రాజుగా అభిషేకించి యుయుత్సుడికే రాజ్యభారం అప్పగిస్తారు.)
౯.కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధ్రుతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇస్తానంటాడు కృష్ణుడు.కానీ తన కుమారులు ఒకరినొకరు చంపుకోవటం తాను కళ్ళారా చూడలేనని తిరస్కరిస్తాడు ధ్రుతరాష్ట్రుడు. కానీ కృష్ణుడు వేరే అతనికి దివ్య దృష్టి ప్రసాదించి ధ్రుతరాష్త్రుడికి యుద్ధ విశేషాలు వివరించమంటాడు.కృష్ణుడు ఎవరికి దివ్య దృష్టి ప్రసాదిస్తాడు?
జ)కృష్ణుడి ద్వారా దివ్య దృష్టి పొందేది సంజయుడు.(ఇతను అర్జునుడికి ప్రాణ స్నేహితుడు.)
౧౦.మహభారతంలో శిఖండిది ఒక ప్రత్యేకమైన పాత్ర.భీష్ముడి మీద పగతో అంబ శివునికై తపస్సు చేసి తిరిగి శిఖండిగా జన్మిస్తుంది.అయితే శిఖండి ఎవరికి పుత్రిక గా జన్మిస్తుంది?
జ)అంబ పాంచాల రాజుకి శిఖండి అనే కూతురిగా జన్మిస్తుంది.(శిఖండిని చలన చిత్రాలలో నపుంసకుడిగానూ, ఏమీ చేతకాని వాడి లాగానూ చూపిస్తారు. కానీ నిజానికి శిఖండి జన్మతః స్త్రీ. శిఖండి వరపుత్రిక కావటం వల్ల ఆమెను స్త్రీ లా కాక పురుషుడి లాగా నే పెంచుతాడు పాంచాల రాజు.యుద్ధ విద్యలూ నేర్పుతాడు.ఐతే ఆమె స్త్రీ అన్న విషయం తెలియని రాజ పురోహితులు ఆమెకు ఒక రాజకుమారి తో వివాహం చెయ్యతానికి నిశ్చయిస్తారు.చేసేది లేక పాంచాల రాజూ ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి కూతురికి ఈ విషయం తెలిసి శిఖండి స్త్రీ అన్న విషయం అందరికీ చెప్పేస్తుంది.తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకొందామని ఒక గుహలో ప్రవేశిస్తుంది శిఖండి. అక్కడ ఉన్న ఒక గంధర్వుడు ఆమె కథ విని జాలి పడి తన పురుష రూపాన్ని ఆమెకిచ్చి ఆమె స్త్రీ రుపాన్ని తాను గ్రహిస్తాడు.ఈ విధంగా శిఖండి స్త్రీగా జన్మించి పురుషుడిగా మారుతుంది.(ఆమెకు పురుష రూపాన్ని ప్రసాదించినందుకు గంధర్వ రాజైన కుబేరుడు ఆ గంధర్వుడి పై కోపించి ఆమె మరణించేంత వరకు స్త్రీ రూపం లోనే ఉండమని శపించటం వేరే కథ.)
౧.కౌరవులు పాండవులను లక్క ఇంటిలో దహనం చెయ్యటానికి కుట్ర పన్నారని మనందరికీ తెలుసు.అయితే ఆ లక్క ఇంటిని ఏ ఊరిలో నిర్మించారు?దాన్ని నిర్మించిన వాస్తు పండితుడు ఎవరు?
జ) లక్క ఇంటిని కౌరవులు వారణావతం అనే ఊరిలో నిర్మిస్తారు. ఆ ఇంటిని నిర్మించిన వాస్తు పండితుడు పురోచనుడు. పాండవులకు ఆ ఊరిపై ఆసక్తి కలగటానికి ఎల్లప్పుడూ ఆ ఊరి గురించి వర్ణించేందుకు కౌరవులు కొందరు జీతగాళ్ళను నియమిస్తారు.వారి మాటల వల్ల ఆ ఊరిపై ఆసక్తి కలిగి పాండవులు ఆ ఊరికి బయలుదేరేటపుడు భీష్ముడు వారిని హెచ్చరిస్తాడు.అంతే కాక వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి(సొరంగం తవ్వేందుకు) ఒక సహాయకుడిని వారి కన్నా ముందే అక్కడికి పంపిస్తాడు.
౨.పాండవుల పురోహితుడు ఎవరు? అతడిని పురోహితుని గా వారికి సూచించినదెవరు?
జ)పాండవుల పురోహితుడు ధౌమ్యుడు. అతణ్ణి వారికి పురోహితునిగా సూచించేది కుంభీనసి అనే ఒక గంధర్వ కాంత. అర్జునుడు ఈమెకు పాశుపతాస్త్రాన్ని భోధించి తాను ఆమె వద్ద చాక్షుషీ విద్య నేర్చుకుంటాడు.
౩.మహాభారతం చదివిన వారికి గుర్తుండిపోయే పాత్రల్లో మొట్తమొదటిది భీష్ముడి పాత్ర.ఆయనకి ఆ పేరు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ వలన వచ్చినదే.అయితే భీష్ముడి అసలు పేరు ఏమిటి?
జ) భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు.(నిజానికి భీష్ముడు శాపగ్రస్తుడైన ధ్యో అనే వసువు అంశలో జన్మిస్తాడు.)
౪.అర్జునుడికి గాండీవి అనే పేరు ఆయన ధరించే ధనస్సు వల్ల వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ విల్లును అర్జునునికి బహుకరించేదెవరు? ఏ సమయంలో?
జ)గాండీవం అనే విల్లు నిజానికి వరుణుడిది.(అందుకే మహాప్రస్థాన సమయంలో అర్జునుడు ఆ విల్లును గంగా నదిలో వదిలేస్తాడు.)అయితే ఈ విల్లుని అగ్ని దేవుడు ఖాండవ దహన సమయంలో బహుకరిస్తాడు(కారణం ఖాండవ వనాన్ని ఇంద్రుడు రక్షిస్తూండటం.)
౫.జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆపేదెవరు?యాగం ఆగే సమయానికి ఋత్విక్కులు ఎవరిని యజ్ఞ గుండం లోకి ఆవాహన చేస్తారు?
జ)సర్పయాగాన్ని ఆపేది అస్తీకుడు.(ఇతను ఆదిశేషుడికి మేనల్లుడు అవుతాడు.అస్తీకుడు సర్పయాగాన్ని ఆపటానికై జన్మించిన కారణ జన్ముడు. ఇతను యజ్ఞ వాటికకి వచ్చి వేద మంత్రాలతో ఆ యజ్ఞం చేస్తున్న రాజుకు ఆశీర్వచనాలు చదువుతూ ఉంటాడు. రాజు అతన్ని చూసి ముచ్చట పడి ఏం కావాలో కోరుకోమనగా ఈ యజ్ఞాన్ని ఆపేయమని కోరతాడు.)యజ్ఞం ఆపే సమయం లో ఋత్విక్కులు తక్షకుడిని ఆవాహన చేస్తారు.అయితే తక్షకుడు భయంతో ఇంద్రుడి అభయం పొందగా మంత్ర ప్రభావం వల్ల ఇంద్రుడు కూడా యజ్ఞ గుండంలో పడబోతాడు. ఐతే యజ్ఞం ఆగిపోయిన కారణంగా రక్షింపబడతాడు.(తక్షకుడిని ఆవాహన చెయ్యటానికి ఋత్విక్కులు చదివే మంత్రం "సహేంద్రే తక్షకాయ స్వాహా!")
౬.అజ్ఞాతవాస సమయం లో పాండవుల మారు పేర్లేమిటి?
జ)ధర్మ రాజు: కంకభట్టు.
భీముడు:వలలుడు.
అర్జునుడు: బృహన్నల.
నకులుడు:థామగ్రంధి.
సహదేవుడు:తంత్రీపాలుడు.
౭.రణరంగం లో వీరవిహారం చేస్తున్న ద్రోణుడిని అస్త్ర సన్యాసం చేయించటానికి శ్రీకృష్ణుడు 'అశ్వత్థామ' అనే ఏనుగును చంపించి ధర్మరాజు చేత 'అశ్వత్థామ హతః' అని గట్టిగా 'కుంజరః' అని చిన్నగా అనిపిస్తాడు.ఇంతకీ ఆ 'అశ్వత్థామ' ఏనుగును చంపేదెవరు?
జ)'అశ్వత్థామ' ఏనుగును చంపేది భీముడు.(తన కుమారుడైన అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు.)
౮.యుద్ధ ప్రారంభ సమయంలో ధర్మరాజు ఇరుపక్షాల లో ఎవరైనా పక్షం మారాలనుకుంటే మారవచ్చని ప్రకటిస్తాడు.ఆ సమయం లో ఎవరెవరు తమ పక్షాలు మారతారు?
జ)ధర్మరాజు చేసిన ప్రకటనతో పక్షం మారేది యుయుత్సుడు.(ఇతను ధ్రుతరాష్త్రుడికి ఒక దాసి వల్ల జన్మిస్తాడు.పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళే సమయం లో బాలుడైన పరీక్షిత్తు ను రాజుగా అభిషేకించి యుయుత్సుడికే రాజ్యభారం అప్పగిస్తారు.)
౯.కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధ్రుతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇస్తానంటాడు కృష్ణుడు.కానీ తన కుమారులు ఒకరినొకరు చంపుకోవటం తాను కళ్ళారా చూడలేనని తిరస్కరిస్తాడు ధ్రుతరాష్ట్రుడు. కానీ కృష్ణుడు వేరే అతనికి దివ్య దృష్టి ప్రసాదించి ధ్రుతరాష్త్రుడికి యుద్ధ విశేషాలు వివరించమంటాడు.కృష్ణుడు ఎవరికి దివ్య దృష్టి ప్రసాదిస్తాడు?
జ)కృష్ణుడి ద్వారా దివ్య దృష్టి పొందేది సంజయుడు.(ఇతను అర్జునుడికి ప్రాణ స్నేహితుడు.)
౧౦.మహభారతంలో శిఖండిది ఒక ప్రత్యేకమైన పాత్ర.భీష్ముడి మీద పగతో అంబ శివునికై తపస్సు చేసి తిరిగి శిఖండిగా జన్మిస్తుంది.అయితే శిఖండి ఎవరికి పుత్రిక గా జన్మిస్తుంది?
జ)అంబ పాంచాల రాజుకి శిఖండి అనే కూతురిగా జన్మిస్తుంది.(శిఖండిని చలన చిత్రాలలో నపుంసకుడిగానూ, ఏమీ చేతకాని వాడి లాగానూ చూపిస్తారు. కానీ నిజానికి శిఖండి జన్మతః స్త్రీ. శిఖండి వరపుత్రిక కావటం వల్ల ఆమెను స్త్రీ లా కాక పురుషుడి లాగా నే పెంచుతాడు పాంచాల రాజు.యుద్ధ విద్యలూ నేర్పుతాడు.ఐతే ఆమె స్త్రీ అన్న విషయం తెలియని రాజ పురోహితులు ఆమెకు ఒక రాజకుమారి తో వివాహం చెయ్యతానికి నిశ్చయిస్తారు.చేసేది లేక పాంచాల రాజూ ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి కూతురికి ఈ విషయం తెలిసి శిఖండి స్త్రీ అన్న విషయం అందరికీ చెప్పేస్తుంది.తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకొందామని ఒక గుహలో ప్రవేశిస్తుంది శిఖండి. అక్కడ ఉన్న ఒక గంధర్వుడు ఆమె కథ విని జాలి పడి తన పురుష రూపాన్ని ఆమెకిచ్చి ఆమె స్త్రీ రుపాన్ని తాను గ్రహిస్తాడు.ఈ విధంగా శిఖండి స్త్రీగా జన్మించి పురుషుడిగా మారుతుంది.(ఆమెకు పురుష రూపాన్ని ప్రసాదించినందుకు గంధర్వ రాజైన కుబేరుడు ఆ గంధర్వుడి పై కోపించి ఆమె మరణించేంత వరకు స్త్రీ రూపం లోనే ఉండమని శపించటం వేరే కథ.)
Wednesday, September 28, 2005
హిందూ మరియూ గ్రీకు పురాణాల మధ్య సారూప్యతలు
నాకు చిన్ననాటి నుండీ కథలంటే చాలా ఇష్టం.
ఆ ఇష్టం తోనే హిందూ పురాణాలలోని చాలా కథలు తెలుసుకున్నాను.
అలాగే 6వ తరగతి లో "ట్రోజన్ వార్" అనే నాన్డిటైల్డ్ చదివి గ్రీకు కథలూ తెలుసుకోవాలన్న ఆసక్తి పెంచుకున్నాను.
అలా నేను అవకాశం దొరికినప్పుడు గ్రీకు కథలను తెలుసుకుంటున్నాను.
అలా గ్రీకు కథలను తెలుసుకుంటూ హిందూ పురాణాలలోని కథలతో పొల్చి చూస్తే చాలా సామ్యములు కనిపించాయి.
నేను తెలుసుకున్న ఈ సారూప్యతలను నేను రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.
చివరిగా ఒక మాట.
ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ కించపరచటానికో లేక వారి అభిప్రాయాలను దెబ్బ తీయటానికో ఉద్ధేశ్యించబడినవి కావు.
ప్రమాదవశాత్తూ అలా జరిగితే క్షంతవ్యుడిని
సతీష్.
ఆ ఇష్టం తోనే హిందూ పురాణాలలోని చాలా కథలు తెలుసుకున్నాను.
అలాగే 6వ తరగతి లో "ట్రోజన్ వార్" అనే నాన్డిటైల్డ్ చదివి గ్రీకు కథలూ తెలుసుకోవాలన్న ఆసక్తి పెంచుకున్నాను.
అలా నేను అవకాశం దొరికినప్పుడు గ్రీకు కథలను తెలుసుకుంటున్నాను.
అలా గ్రీకు కథలను తెలుసుకుంటూ హిందూ పురాణాలలోని కథలతో పొల్చి చూస్తే చాలా సామ్యములు కనిపించాయి.
నేను తెలుసుకున్న ఈ సారూప్యతలను నేను రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.
చివరిగా ఒక మాట.
ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ కించపరచటానికో లేక వారి అభిప్రాయాలను దెబ్బ తీయటానికో ఉద్ధేశ్యించబడినవి కావు.
ప్రమాదవశాత్తూ అలా జరిగితే క్షంతవ్యుడిని
సతీష్.
Wednesday, September 21, 2005
భగీరధ ప్రయత్నం
భగీరధుడు ఘోర తపస్సు చేసి దేవలోకంలో ఉన్న గంగను భువికి దించి తన పితరులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు.
ఇదీ సాదారణంగా అందరికీ తెలిసిన కధ.కానీ భగీరధుడి పూర్వులకు ఏమైనది? వారికి పుణ్యలోకాలు ఎందుకు కలగలేదు? అంటే మాత్రం ఏ కొద్ది మందో తప్పితే చెప్పలేరు.
ఇప్పుడు భగీరధుడు గంగ కోసం తపస్సు చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి ఏమైనది అనేది ఈ ప్రచురణలో వివరిస్తాను
సగరుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. శ్రీరాముని పూర్వుడు. అతనికి యవనాశ్వుడనే పుత్రునితో పాటు అరవై వేల మంది పుత్రులు కలరు. ఒకనాడు సగరుడు అశ్వమేధ యాగము చేయుటకు తలచెను.తలచినదే తడవుగా తన కులగురువును సంప్రదించి సుముహుర్తము నిర్ణయించి యాగము ప్రారంభించెను.యజ్ఞ సమాప్తి అయిన పిదప యజ్ఞాశ్వమును వదలి దానికి రక్షకులుగా సగరుని అరవై వేల మంది పుత్రులు వెడలిరి.ఈ యాగమును చూసి ఇంద్రుడు ఇది తన ఇంద్ర పదవి కొరకై జరుగుతున్న యజ్ఞము గా భావించి దానిని భగ్నము చేయుటకై ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి పాతాళం లో ఉన్న కపిల మహర్షి ఆశ్రమములో దాచెను. అశ్వ రక్షకులైన సగరుని పుత్రులు దాని కొరకై వెదకుచూ అన్ని లోకములలోనూ గాలించి చివరకు పాతళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో తమ అశ్వాన్ని కనుగొని , కపిలుడే తమ అశ్వమును అపహరించినాడని తలచి పరిపరివిధముల కపిలుని దూషించిరి. దానికి మిక్కిలి కోపోద్రిక్తుడైన కపిలుడు వారిని భస్మము చేసెను.
అశ్వ రక్షకులుగా వెళ్ళిన తన పుత్రుల జాడ తెలియక చింతించుచున్న సగరుని అతని మనుమడైన(యవనాశ్వుని పుత్రుడు) అంశుమంతుడు ఊరడించి వారిని గాలించుటకు తాను వెడలెను. అంశుమంతుడు సకల లోకాలనూ గాలించి చివరకు కపిల ముని ఆశ్రమమునకు చేరుకొని అక్కడ తమ యజ్ఞాశ్వమునూ, దాని ప్రక్కననే ఉన్న భస్మ రాశులను చూసి జరిగినది గ్రహించి కపిలుని వద్దకు వెళ్ళి పరిపరివిధముల ప్రార్ధించి తన పితరులకు పుణ్యలోకములు ప్రాప్తించు మార్గమును తెలుపమనెను. దానితో శాంతుడైన కపిలుడు అతనిని ఊరడించి దేవలోకములో నున్న గంగా జలము వారి భస్మ రాశుల పై నుండి ప్రవహించినచో వారికి పుణ్యలోకాలు సంప్రాప్తించగలవని సెలవిచ్చెను.
అంశుమంతుడు విచారవదనుడై తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతమును అందరికీ వివరించెను. అంశుమంతుడూ , అతని కుమారుడైన దిలీపుడూ గంగను భువికి తెచ్చు మార్గమును అన్వేషించుచునే పరమపదించినారు. దిలీపుని కొదుకైన భగీరదుడు తన పితరులకు ఎటులైననూ పుణ్యగతులు కలిగించవలెనని యోచించి గంగను గూర్చి తీవ్రముగా తపస్సు చేసెను. అటుల కొన్ని సంవత్సరములు గడచిన పిదప గంగ ప్రత్యక్షమాయెను. ఆమెకు ప్రణమిల్లి భగీరదుడు తన పితరులను పునీతులను చేయమని ప్రార్ధింపగా, తాను దివి నుండి భువికు వచ్చు వేగమును భూమి తాళలేదనియూ , తనను భరించువానిని చూపమని చెప్పి అదృశ్యమయ్యెను. తరుణోపాయము కానక భగీరదుడు బ్రహ్మ గురించి తపమారంభించెను. కొన్నాళ్ళకు బ్రహ్మ ప్రత్యక్షమై గంగను భరించుటకు తగినవాడు పరమశివుడే గాన ఆతనిని గురించి తపస్సు చేయమని సూచించెను. భగీరదుడు పరమశివుని గూర్చి తీవ్రమైన తపస్సు చేసెను. దానికి సంతసించి పరమశివుడు ప్రత్యక్షమై వరము కొరుకోమనగా గంగ భువి నుండి దివికి దిగు సమయమున ఆమె వేగమును భరించుమని వేడగా అట్లే యని తన అంగీకారము తెలిపెను. పిదప భగీరదుడు గంగను ప్రార్దించగా గంగ తీవ్రమైన ఉద్ధృతితో పై నుండి ప్రవహించగా మహదేవుడు అద్భుతముగా తన జటాజూటిలో బంధించెను. మరలా భగీరదుడు శివుని ప్రార్ధించగా తన జటలోనుండి ఒక పాయగా గంగను వదిలెను.అటుల భువికి దిగిన గంగ తన ప్రయాణంలో ఐదు పాయలుగా విడిపోయి ఒక పాయ భగీరదుని వెంట రాగా మిగిలిన పాయలు చెరొక దిశగా నాలుగు దిక్కులకూ ప్రవహించినవి.
అటుల భగీరదుని వెంట వచ్చుచున్న గంగలో ప్రజలందరూ పుణ్య స్నానములాచరించి పవిత్రులైరి. అలా వచ్చుచున్న గంగ ఉద్ధృతికి జహ్ను ముని ఆశ్రమమంతయూ జలమయమయ్యెను.దానికి కోపించిన ఆ ఋషి భగీరదుని వెంట వచ్చుచున్న గంగ లోని జలమంతయూ త్రాగి వేసెను. భగీరదుడు ఆ మునిని ప్రార్ధించగా ఆయన తన కర్ణ రంధ్రము ద్వారా గంగను వదిలెను. అలా ప్రయాణిస్తూ చివరికి పాతళంలోనున్న కపిలుని ఆశ్రమం చేరి అక్కడ ఉన్న సగర పుత్రుల భస్మరాశుల పై ప్రవహించి వారి కి పుణ్యలోక ప్రాప్తి కలిగించెను. సగరుల భస్మరాశులు కలిసిన ఆ ప్రదేశం సాగరం గా ప్రసిద్ధి చెందెను. అటులనే భగీరదుని చే భువికి గొని రాబడుటచే భాగీరధి అనియూ, మూడు లోకములనూ పావనము చేసినది గాన త్రిపధగ(ముల్లోకముల లోనూ ప్రవహించునది) అనియూ, జహ్నుముని చే ఉద్ధరింపబడెను కావున జాహ్నవి అనియూ పలు నామములతో కీర్తింపబడుచున్నది.
ఈ విధంగా భగీరధుడు గంగను భువి కి దించి తన పితరులకు పరలోక ప్రాప్తి కలిగించెను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే భగీరధుడు తన స్వార్ధం కోసం ఏమీ చేయలేదు. తన పితృదేవులకు పరలోకప్రాప్తి కలిగించాలనేదే అతని ఆశయం.నిజానికి భగీరధుడు అలా చేయకపోయినా ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు. కానీ తనే ఎన్నో కష్టాలను లెక్క చేయక ఈ కార్యాన్ని సాధించాడు.ఇంకొక విషయం ఏంటంటే భగీరధుడు తపస్సు చేసిన ప్రతిసారీ అతనికి ఆ దేవత/దేవుడు ప్రత్యక్షం కావటానికి పట్టిన కాలం కొన్ని వేల సంవత్సరాలు అని గుర్తించాలి .
ఇప్పుడు మీరే చెప్పండి భగీరధుని పేరు ప్రయత్నానికి మారుపేరుగా నిలిచిపోవటం సమంజసమే కద!
ఇదీ సాదారణంగా అందరికీ తెలిసిన కధ.కానీ భగీరధుడి పూర్వులకు ఏమైనది? వారికి పుణ్యలోకాలు ఎందుకు కలగలేదు? అంటే మాత్రం ఏ కొద్ది మందో తప్పితే చెప్పలేరు.
ఇప్పుడు భగీరధుడు గంగ కోసం తపస్సు చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి ఏమైనది అనేది ఈ ప్రచురణలో వివరిస్తాను
సగరుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. శ్రీరాముని పూర్వుడు. అతనికి యవనాశ్వుడనే పుత్రునితో పాటు అరవై వేల మంది పుత్రులు కలరు. ఒకనాడు సగరుడు అశ్వమేధ యాగము చేయుటకు తలచెను.తలచినదే తడవుగా తన కులగురువును సంప్రదించి సుముహుర్తము నిర్ణయించి యాగము ప్రారంభించెను.యజ్ఞ సమాప్తి అయిన పిదప యజ్ఞాశ్వమును వదలి దానికి రక్షకులుగా సగరుని అరవై వేల మంది పుత్రులు వెడలిరి.ఈ యాగమును చూసి ఇంద్రుడు ఇది తన ఇంద్ర పదవి కొరకై జరుగుతున్న యజ్ఞము గా భావించి దానిని భగ్నము చేయుటకై ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి పాతాళం లో ఉన్న కపిల మహర్షి ఆశ్రమములో దాచెను. అశ్వ రక్షకులైన సగరుని పుత్రులు దాని కొరకై వెదకుచూ అన్ని లోకములలోనూ గాలించి చివరకు పాతళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో తమ అశ్వాన్ని కనుగొని , కపిలుడే తమ అశ్వమును అపహరించినాడని తలచి పరిపరివిధముల కపిలుని దూషించిరి. దానికి మిక్కిలి కోపోద్రిక్తుడైన కపిలుడు వారిని భస్మము చేసెను.
అశ్వ రక్షకులుగా వెళ్ళిన తన పుత్రుల జాడ తెలియక చింతించుచున్న సగరుని అతని మనుమడైన(యవనాశ్వుని పుత్రుడు) అంశుమంతుడు ఊరడించి వారిని గాలించుటకు తాను వెడలెను. అంశుమంతుడు సకల లోకాలనూ గాలించి చివరకు కపిల ముని ఆశ్రమమునకు చేరుకొని అక్కడ తమ యజ్ఞాశ్వమునూ, దాని ప్రక్కననే ఉన్న భస్మ రాశులను చూసి జరిగినది గ్రహించి కపిలుని వద్దకు వెళ్ళి పరిపరివిధముల ప్రార్ధించి తన పితరులకు పుణ్యలోకములు ప్రాప్తించు మార్గమును తెలుపమనెను. దానితో శాంతుడైన కపిలుడు అతనిని ఊరడించి దేవలోకములో నున్న గంగా జలము వారి భస్మ రాశుల పై నుండి ప్రవహించినచో వారికి పుణ్యలోకాలు సంప్రాప్తించగలవని సెలవిచ్చెను.
అంశుమంతుడు విచారవదనుడై తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతమును అందరికీ వివరించెను. అంశుమంతుడూ , అతని కుమారుడైన దిలీపుడూ గంగను భువికి తెచ్చు మార్గమును అన్వేషించుచునే పరమపదించినారు. దిలీపుని కొదుకైన భగీరదుడు తన పితరులకు ఎటులైననూ పుణ్యగతులు కలిగించవలెనని యోచించి గంగను గూర్చి తీవ్రముగా తపస్సు చేసెను. అటుల కొన్ని సంవత్సరములు గడచిన పిదప గంగ ప్రత్యక్షమాయెను. ఆమెకు ప్రణమిల్లి భగీరదుడు తన పితరులను పునీతులను చేయమని ప్రార్ధింపగా, తాను దివి నుండి భువికు వచ్చు వేగమును భూమి తాళలేదనియూ , తనను భరించువానిని చూపమని చెప్పి అదృశ్యమయ్యెను. తరుణోపాయము కానక భగీరదుడు బ్రహ్మ గురించి తపమారంభించెను. కొన్నాళ్ళకు బ్రహ్మ ప్రత్యక్షమై గంగను భరించుటకు తగినవాడు పరమశివుడే గాన ఆతనిని గురించి తపస్సు చేయమని సూచించెను. భగీరదుడు పరమశివుని గూర్చి తీవ్రమైన తపస్సు చేసెను. దానికి సంతసించి పరమశివుడు ప్రత్యక్షమై వరము కొరుకోమనగా గంగ భువి నుండి దివికి దిగు సమయమున ఆమె వేగమును భరించుమని వేడగా అట్లే యని తన అంగీకారము తెలిపెను. పిదప భగీరదుడు గంగను ప్రార్దించగా గంగ తీవ్రమైన ఉద్ధృతితో పై నుండి ప్రవహించగా మహదేవుడు అద్భుతముగా తన జటాజూటిలో బంధించెను. మరలా భగీరదుడు శివుని ప్రార్ధించగా తన జటలోనుండి ఒక పాయగా గంగను వదిలెను.అటుల భువికి దిగిన గంగ తన ప్రయాణంలో ఐదు పాయలుగా విడిపోయి ఒక పాయ భగీరదుని వెంట రాగా మిగిలిన పాయలు చెరొక దిశగా నాలుగు దిక్కులకూ ప్రవహించినవి.
అటుల భగీరదుని వెంట వచ్చుచున్న గంగలో ప్రజలందరూ పుణ్య స్నానములాచరించి పవిత్రులైరి. అలా వచ్చుచున్న గంగ ఉద్ధృతికి జహ్ను ముని ఆశ్రమమంతయూ జలమయమయ్యెను.దానికి కోపించిన ఆ ఋషి భగీరదుని వెంట వచ్చుచున్న గంగ లోని జలమంతయూ త్రాగి వేసెను. భగీరదుడు ఆ మునిని ప్రార్ధించగా ఆయన తన కర్ణ రంధ్రము ద్వారా గంగను వదిలెను. అలా ప్రయాణిస్తూ చివరికి పాతళంలోనున్న కపిలుని ఆశ్రమం చేరి అక్కడ ఉన్న సగర పుత్రుల భస్మరాశుల పై ప్రవహించి వారి కి పుణ్యలోక ప్రాప్తి కలిగించెను. సగరుల భస్మరాశులు కలిసిన ఆ ప్రదేశం సాగరం గా ప్రసిద్ధి చెందెను. అటులనే భగీరదుని చే భువికి గొని రాబడుటచే భాగీరధి అనియూ, మూడు లోకములనూ పావనము చేసినది గాన త్రిపధగ(ముల్లోకముల లోనూ ప్రవహించునది) అనియూ, జహ్నుముని చే ఉద్ధరింపబడెను కావున జాహ్నవి అనియూ పలు నామములతో కీర్తింపబడుచున్నది.
ఈ విధంగా భగీరధుడు గంగను భువి కి దించి తన పితరులకు పరలోక ప్రాప్తి కలిగించెను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే భగీరధుడు తన స్వార్ధం కోసం ఏమీ చేయలేదు. తన పితృదేవులకు పరలోకప్రాప్తి కలిగించాలనేదే అతని ఆశయం.నిజానికి భగీరధుడు అలా చేయకపోయినా ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు. కానీ తనే ఎన్నో కష్టాలను లెక్క చేయక ఈ కార్యాన్ని సాధించాడు.ఇంకొక విషయం ఏంటంటే భగీరధుడు తపస్సు చేసిన ప్రతిసారీ అతనికి ఆ దేవత/దేవుడు ప్రత్యక్షం కావటానికి పట్టిన కాలం కొన్ని వేల సంవత్సరాలు అని గుర్తించాలి .
ఇప్పుడు మీరే చెప్పండి భగీరధుని పేరు ప్రయత్నానికి మారుపేరుగా నిలిచిపోవటం సమంజసమే కద!
Sunday, September 18, 2005
ప్రయత్నం
ఎవరైనా ఏదైనా సాధించాలంటే కావలసింది ప్రయత్నం.
మన పురాణాలలో కూడ ప్రయత్నానికి సంబంధించి చాల దృష్టాంతాలున్నాయి.
కానీ మనకు ప్రయత్నం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భగీరధుడు.
ఎవరైనా చాలా ప్రయత్నించి (అపజయాలను కూడ లెక్క చేయకుండా ) ఏదైనా సాదిస్తే వారు భగీరధ ప్రయత్నం చేసారనో లేక భగీరదుడి లా కష్టపడ్డాడనో అనటం సర్వ సాధారణం
.కానీ మన పురాణాలలో ఎంతో ప్రయత్నించి అపజయాలను కూడ లెక్క చేయకుండా అనుకున్నది సాధించిన వారు ఇంకొంత మంది ఉన్నారు.
వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు విశ్వామిత్రుడు మరియూ ధ్రువుడు.
ఈ ముగ్గురూ ఎంత కష్టపడి తాము అన్నుకున్నది సాధించారో సవివరంగా రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.
మన పురాణాలలో కూడ ప్రయత్నానికి సంబంధించి చాల దృష్టాంతాలున్నాయి.
కానీ మనకు ప్రయత్నం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భగీరధుడు.
ఎవరైనా చాలా ప్రయత్నించి (అపజయాలను కూడ లెక్క చేయకుండా ) ఏదైనా సాదిస్తే వారు భగీరధ ప్రయత్నం చేసారనో లేక భగీరదుడి లా కష్టపడ్డాడనో అనటం సర్వ సాధారణం
.కానీ మన పురాణాలలో ఎంతో ప్రయత్నించి అపజయాలను కూడ లెక్క చేయకుండా అనుకున్నది సాధించిన వారు ఇంకొంత మంది ఉన్నారు.
వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు విశ్వామిత్రుడు మరియూ ధ్రువుడు.
ఈ ముగ్గురూ ఎంత కష్టపడి తాము అన్నుకున్నది సాధించారో సవివరంగా రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.
Subscribe to:
Posts (Atom)


