నాకు తెలిసిన సంగతులు కొన్ని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాకు తెలిసిన సంగతులు కొన్ని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, డిసెంబర్ 15, 2009

కాళిదాసు గురించి -1 : కోహం రండే?

కాళిదాసు గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.   ఉపమాలంకార ప్రయోగంలో ఆయనకి ఆయనే సాటి. అందుకే ఆయన గురించి చెప్పేటప్పుడు   "ఉపమా కాళిదాసః" అంటారు.
కాళిదాసు గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడని కొంతమందీ, భోజ రాజు ఆస్థానంలో ఉండేవాడని కొంతమందీ అంటారు.

బుధవారం, మార్చి 21, 2007

ఓం అక్షరాయ నమః

ఇది శ్రీ మంజునాధ చిత్రం కోసం భారవి గారు రాసిన పాట. ఈ పాట అంతా శివ స్తోత్రాలతో ఉంటుంది. ఇవన్ని మనకి తెలిసిన స్తోత్రాలే అయినా ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాట లోని స్తోత్రాలన్నీ వర్ణమాలా క్రమంలో ఉంటాయి. అంటే ఓం అక్షరాయ నమః, ఆద్యంతరహితాయనమః, ఇందీవరదళశ్యామాయనమః, ఈశ్వరాయనమః ... ఇలా అ, ఆ, ఇ, ఈ, ... వర్ణమాల లోని అక్షరాలతో సాగిపోతుంది ఈ పాట. ఇలా స్తోత్రాలన్నిటిని కష్టపడి వర్ణమాలా క్రమం లో అమర్చిన భారవి గారిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.


ఇక విషయానికొస్తే ఈ పాట ఓం అక్షరాయ నమః అని మొదలవుతుంది. ఈ స్తోత్రం లోని అంతరార్ధం మొదట నాకు పూర్తిగా అర్ధం కాలేదు. మనకి తెలిసినంతవరకు అక్షరం అనేది విద్యకి సంబంధించిన పదం. సాధారణంగా మనం విద్య కి అధిదేవతలుగా సరస్వతీ దేవిని కాని, గణపతి ని కానీ పూజిస్తాం. మరి అక్షరాయ నమః అనే స్తోత్రం శివుడికి ఎలా వర్తిస్తుంది? మన దేవతా స్తోత్రాలలో కొన్ని అందరు దేవుళ్ళకీ వర్తించేలా ఉంటాయి. అంటే లోకరక్షక, భక్తజనపాలక లాగ. ఇది కూడ అలాగే ఆపాదించిన ఎదో ఒక స్తోత్రం అని సరిపెట్టుకున్నాను.
కానీ కొన్ని రోజుల తర్వాత దాని అంతరార్ధం తెలుసుకున్నాను. నిజానికి అక్షరం ఒక సంస్కృత పదం. న క్షరం అని దానికి విగ్రహం. వ్యతిరేకార్ధాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది నఞ్ తత్పురుష సమాసం. క్షరం అంటే నాశనం. అక్షరం అంటే నాశనం లేనిది. అంటే ఓం అక్షరాయ నమః అనే స్తోత్రం తో శివుణ్ణి నాశనము లేని వాడా అని కీర్తించినట్టు. అది కూడ పాట ప్రారంభం లో ఇలా స్తుతించటం ఎంతైనా సమంజసం.

సోమవారం, ఏప్రిల్ 24, 2006

మన మహాభారతం తెలుసుకుందాం

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.చిన్నతనం నుంచీ మనకు పరిచయమున్న మహాభారతం లో మనకెంత తెలుసో ఒకసారి పరీక్షించుకుందాం.

బుధవారం, సెప్టెంబర్ 21, 2005

భగీరధ ప్రయత్నం

భగీరధుడు ఘోర తపస్సు చేసి దేవలోకంలో ఉన్న గంగను భువికి దించి తన పితరులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు.
ఇదీ సాదారణంగా అందరికీ తెలిసిన కధ.కానీ భగీరధుడి పూర్వులకు ఏమైనది? వారికి పుణ్యలోకాలు ఎందుకు కలగలేదు? అంటే మాత్రం ఏ కొద్ది మందో తప్పితే చెప్పలేరు.
ఇప్పుడు భగీరధుడు గంగ కోసం తపస్సు చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి ఏమైనది అనేది ఈ ప్రచురణలో వివరిస్తాను

ఆదివారం, సెప్టెంబర్ 18, 2005

ప్రయత్నం

ఎవరైనా ఏదైనా సాధించాలంటే కావలసింది ప్రయత్నం.
మన పురాణాలలో కూడ ప్రయత్నానికి సంబంధించి చాల దృష్టాంతాలున్నాయి.
కానీ మనకు ప్రయత్నం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భగీరధుడు.
ఎవరైనా చాలా ప్రయత్నించి (అపజయాలను కూడ లెక్క చేయకుండా ) ఏదైనా సాదిస్తే వారు భగీరధ ప్రయత్నం చేసారనో లేక భగీరదుడి లా కష్టపడ్డాడనో అనటం సర్వ సాధారణం
.కానీ మన పురాణాలలో ఎంతో ప్రయత్నించి అపజయాలను కూడ లెక్క చేయకుండా అనుకున్నది సాధించిన వారు ఇంకొంత మంది ఉన్నారు.
వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు విశ్వామిత్రుడు మరియూ ధ్రువుడు.
ఈ ముగ్గురూ ఎంత కష్టపడి తాము అన్నుకున్నది సాధించారో సవివరంగా రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.