సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, జనవరి 22, 2012

నా మూడో చంధో పద్యం - తిరుమొళిశై ఆళ్వారుల దివ్య పాశురం


వైష్ణవాన్ని ఉజ్జీవింప చేసిన వారిలో ఆళ్వారులు ప్రముఖులు.
ఈ పన్నిద్దరు ఆళ్వారుల లోనూ తిరుమొళిశై ఆళ్వారులది ప్రత్యేక స్థానం.

మంగళవారం, డిసెంబర్ 15, 2009

కాళిదాసు గురించి -1 : కోహం రండే?

కాళిదాసు గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.   ఉపమాలంకార ప్రయోగంలో ఆయనకి ఆయనే సాటి. అందుకే ఆయన గురించి చెప్పేటప్పుడు   "ఉపమా కాళిదాసః" అంటారు.
కాళిదాసు గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడని కొంతమందీ, భోజ రాజు ఆస్థానంలో ఉండేవాడని కొంతమందీ అంటారు.

బుధవారం, మార్చి 19, 2008

నేను చదివిన పుస్తకాలు

నాకు పుస్తకాలు చదవటం అంటే పిచ్చి, వెర్రి, ఇంక దాన్ని పోల్చటానికి ఎన్ని ఉపమానాలుంటే అన్నీనూ.
నా మిత్రులైతే నన్ను పుస్తకాల పురుగు అని ముద్దుగా పిలిచేవారు.
నేను ఇప్పటివరకూ చాలా పుస్తకాలు చదివాను
అందులో తెలుగు సాహిత్యానికి సంబందించినవి, గ్రీకుపురాణాలకు సంబందించినవీ ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఇక నుంచీ నేను చదివిన పుస్తకాలలోని విశేషాలు మీ అందరితో పంచుకుంటాను.


నేను ఈ సారి చెప్పబోతున్న పుస్తకం: హంసగీతం.
ఈ పుస్తకం గురించి చిన్న పరిచయం
ఇది వివిన మూర్తి గారి కలం నుండి జాలువారిన చారిత్రిక నవల. ఇతివౄత్తం శ్రీనాథ కవి సార్వభౌముని జీవిత చరిత్ర.ఇది "రచన" పత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది.
ఆ నవల ఆవిష్కరణ సమయంలో "హిందూ" పత్రిక లో వచ్చిన ఈ సమీక్ష చూదండి.
http://www.hindu.com/br/2003/10/28/stories/2003102800030201.htm


దీని గురించి మరింత వివరంగా మరో ప్రచురనలో వివరిస్తాను.
చివరిగా ఒక చిన్న మాట.
ఇది నేనేదో ఆ పుస్తకానికి రాసే సమీక్ష కాదు.నాకు అంతటి పాండిత్యమూ లేదు, ఆ అర్హతా లేదు.
నేను పుస్తకాల్లో చదివి తెలుసుకున్న విషయాలని మీతో పంచుకోవాలని చేసే చిరు ప్రయత్నం మాత్రమే.


ఉంటాను...