స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో ఒక మహా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి నారాయణుడే వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలసాడని ప్రతీతి.
గురువారం, మే 17, 2012
వరదరాజ స్వామి
స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో ఒక మహా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి నారాయణుడే వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలసాడని ప్రతీతి.
ఆదివారం, జనవరి 22, 2012
నా మూడో చంధో పద్యం - తిరుమొళిశై ఆళ్వారుల దివ్య పాశురం
బుధవారం, డిసెంబర్ 28, 2011
నా రెండో చంధో పద్యం
గురువారం, సెప్టెంబర్ 25, 2008
నా మొదటి ఛందో పద్యం
మొన్న కొత్తపాళీ గారు ఇచ్చిన ఈ ఇతివృత్తం చూసినప్పుడు నాకు “సిరికిన్ జెప్పడు” లాగా లక్ష్మీ దేవి తన భక్తులను రక్షించటానికి వెళ్ళే సన్నివేశాన్ని అదే ఛందస్సులో రాయాలన్న ఊహ వచ్చింది. చాలా కష్టపడ్డాక చివరికి ఈ పద్యం రాయగలిగాను. ప్రాస అయితే కుదిరింది కానీ యతి కుదరలేదు.
మ|| హరికిన్ జెప్పదు కైటభారి పదముల్ సంప్రీతి సేవింపదే
సురపుష్పమ్ములు బెట్టదన్యములు ఆలోచింపదాందోళనా
భర మంజీరములొగ్గగా గనదు పాలార్ణమ్మునన్ దిన్న వే
లరుచుల్వెన్నలు అంటగా దుడువదా భక్తావనోత్సాహియై
తన భక్తులని రక్షింప ఉద్యుక్తయైన లక్ష్మి, ఆ హరికైనా చెప్పక, తాను ఎంతో ప్రేమతో సేవించే విష్ణుమూర్తి పాదాలను సేవించక, తనకి ఇష్టమైన పారిజాతాలైనా పెట్టుకోక,మరే విషయముల గురించీ ఆలోచించకా,ఆందోళన నిండిన ఆమె పాదాల వడిని ఓర్వలేక జారుతున్న మువ్వలనైనా సరిజేయక, ప్రీతితో క్షీరసాగరంపై తేలేటి వెన్నలు తినగా పెదాలపై అంటుకున్న తరకలైనా తుడువక ఉన్నఫళంగా వడివడిగా, హడావిడిగా బయలుదేరింది.
ఈ ఇతివృత్తాన్నికి కథ కూడా మొదలు పెట్టాను. గడువు పొదిగించారు కదా, పూర్తి చెయ్యగలనని అనుకుంటున్నాను.