పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, మే 17, 2012

వరదరాజ స్వామి

వైష్ణవుల దివ్య దేశాలలో కంచికి ఒక విశిష్ట స్థానం ఉంది.
స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో ఒక మహా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి నారాయణుడే వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలసాడని ప్రతీతి.

ఆదివారం, జనవరి 22, 2012

నా మూడో చంధో పద్యం - తిరుమొళిశై ఆళ్వారుల దివ్య పాశురం


వైష్ణవాన్ని ఉజ్జీవింప చేసిన వారిలో ఆళ్వారులు ప్రముఖులు.
ఈ పన్నిద్దరు ఆళ్వారుల లోనూ తిరుమొళిశై ఆళ్వారులది ప్రత్యేక స్థానం.

బుధవారం, డిసెంబర్ 28, 2011

నా రెండో చంధో పద్యం


కొన్నాళ్ళ క్రితం నేను   పద్యంతో నా చంధో ప్రయాణం ప్రారంభించాను.
ఈ పద్యం నడక బాగున్నా యతి నియమం పాటించటంలో నేను అంత శ్రద్ధ చూపలేదు.
ఇక తర్వాత యతి నియమం కూడా పాటించి ఈ పద్యాన్ని మార్చి రాద్దామని అనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు.
ఈ మధ్యన రామాయణంలో అహల్యా శాప విమోచన ఘట్టం చదువుతున్నప్పుడు "ఈ పాదాలకు రాతిని నాతి చేయగలిగే మహిమ ఎలా అబ్బి ఉంటుంది?" అనే ప్రశ్న నాలో ఉదయించింది. 

గురువారం, సెప్టెంబర్ 25, 2008

నా మొదటి ఛందో పద్యం

మొన్న కొత్తపాళీ గారు ఇచ్చిన ఇతివృత్తం చూసినప్పుడు నాకు సిరికిన్ జెప్పడు లాగా లక్ష్మీ దేవి తన భక్తులను రక్షించటానికి వెళ్ళే సన్నివేశాన్ని అదే ఛందస్సులో రాయాలన్న ఊహ వచ్చింది. చాలా కష్టపడ్డాక చివరికి పద్యం రాయగలిగాను. ప్రాస అయితే కుదిరింది కానీ యతి కుదరలేదు.


|| హరికిన్ జెప్పదు కైటభారి పదముల్ సంప్రీతి సేవింపదే

సురపుష్పమ్ములు బెట్టదన్యములు ఆలోచింపదాందోళనా

భర మంజీరములొగ్గగా గనదు పాలార్ణమ్మునన్ దిన్న వే

లరుచుల్వెన్నలు అంటగా దుడువదా భక్తావనోత్సాహియై


తన భక్తులని రక్షింప ఉద్యుక్తయైన లక్ష్మి, హరికైనా చెప్పక, తాను ఎంతో ప్రేమతో సేవించే విష్ణుమూర్తి పాదాలను సేవించక, తనకి ఇష్టమైన పారిజాతాలైనా పెట్టుకోక,మరే విషయముల గురించీ ఆలోచించకా,ఆందోళన నిండిన ఆమె పాదాల వడిని ఓర్వలేక జారుతున్న మువ్వలనైనా సరిజేయక, ప్రీతితో క్షీరసాగరంపై తేలేటి వెన్నలు తినగా పెదాలపై అంటుకున్న తరకలైనా తుడువక ఉన్నఫళంగా వడివడిగా, హడావిడిగా బయలుదేరింది.

ఈ ఇతివృత్తాన్నికి కథ కూడా మొదలు పెట్టాను. గడువు పొదిగించారు కదా, పూర్తి చెయ్యగలనని అనుకుంటున్నాను.